హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేయడంపై బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ ఎస్ అధిష్ఠానం పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు గులాబీ పార్టీ నేతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు పోరాటం కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు హైదరాబాద్లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన నిరసనలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజులపాలన ప్రజల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ సర్కార్
420 హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని, ఈ విషయంలో ప్రజలను మరింత చైతన్యపరచాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాసర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 3న నిర్వహించే రైతు సదస్సుల్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని వెల్లడించారు.