Yadadri : యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజైన బుధవారం ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం ( చక్ర స్నానం) కార్యక్రమాలను నిర్వహించారు.
ఇవాళ రాత్రికి కూడా ఆలయ అర్చకులు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం లాంటి క్రతువులను నిర్వహించనున్నారు. కాగా, యాదాద్రిలో గత 10 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.