హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) కార్యాలయంలో మంగళవారం ఆషాడ బోనాలను ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల సంబురాల్లో విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, సభ్యుడు శుభప్రద పటేల్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృప కటాక్షాలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.