స్టేషన్ ఘన్పూర్, మే 23: లక్షల్లో ఒకరికి ఉండే బాంబే బ్లడ్ గ్రూప్ అందించి ఆదుకోవాలని జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన పాలకొండ వెంకటేశ్వర్లు కుటుంబీకులు వేడుకొంటున్నారు. 40 ఏండ్ల నుంచి పలు దవాఖానల్లో కాంపౌండర్గా, థియేటర్ అసిస్టెంట్గా వెంకటేశ్వర్లు పనిచేశాడు. ఇటీవల క్యాన్సర్ బారినపడ్డారు. ఆయనది అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్గా తేలింది. వెంకటేశ్వర్లు కుటుంబానికి రక్త పరీక్షలు నిర్వహించగా ఎవరికీ ఈ బ్లడ్గ్రూప్ లేదు. ఆయనకు మూడు యూనిట్ల రక్తం ఎక్కిస్తే గానీ చికిత్స అందించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు. ఈ బ్లడ్ గ్రూపు కలిగిన వారి వివరాలు తెలిసినవారు, రక్తమిచ్చే వారు 94947 87324, 98498 84968 నంబర్లకు సమాచారమి వ్వాలని బాధితుడి కుటుంబీకులు కోరుతున్నారు.