హైదరాబాద్: బాలీవుడ్లో పేరు సంపాదించిన హైదరాబాదీ నటుడు చంద్రశేఖర్ వైద్య(97) బుధవారం ఉదయం కన్నుమూశారు. రామాయణ్ ధారావాహికతో నటుడిగా గుర్తింపు దక్కించుకొన్న ఈయన.. ముంబైలోని స్వగృహంలోనే నిద్రలో తుదిశ్వాస విడిచారని చంద్రశేఖర్ కుమారుడు, నిర్మాత అశోక్ తెలిపారు. ‘నాన్నగారు నిద్రలోనే కన్నుమూశారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. వయసు మీద పడటంతోనే చనిపోయారు’ అని వెల్లడించారు. బుధవారం సాయంత్రం జుహులోని పవన్హాన్స్లో చంద్రశేఖర్ అంత్యక్రియలు జరిగాయి.