హైదరాబాద్ : పహడీషరీఫ్ పేలుడు ఘటన కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న పెళ్లి డెకరేషన్ సామగ్రి గోదాంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. గోదాంలో ఉన్న రసాయన పెట్టే పేలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది.