నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయింది. ఘోరమైన ఓటమిని చవి చూసింది. ఈ ఉప ఎన్నికలో 1,89,782 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి కేవలం 6 వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తం 25 రౌండ్లలో ఏ రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది. ప్రతి రౌండ్లోనూ వెయ్యి కంటే తక్కువ ఓట్లను పొందింది. ఒకట్రెండు రౌండ్లలో మాత్రమే బీజేపీ అభ్యర్థి వెయ్యికి పైగా ఓట్లను పొందారు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ఏడుస్తూ, తుడుస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ భంగపాటుకు గురయ్యాడు. ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీ నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పారు సాగర్ ఓటర్లు.