తిరుమలాయపాలెం, డిసెంబర్ 15: రాజకీయ లబ్ధికోసం బీజేపీ దేశంలో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో గురువారం జరిగిన పార్టీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రా ష్ర్టాలు, ప్రాంతాల మధ్య మతవిద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతున్నదని మండిపడ్డారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.