Dubbaka | సిద్దిపేట : భారత రాష్ట్ర సమితి పార్టీ( BRS Party )లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ( BJP )కి మరో షాక్ తగిలింది. తాజాగా బీజేపీ దళిత్ మోర్చా( BJP Dalit Morcha ) జనరల్ సెక్రటరీ కే నర్సింహులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి( MP Kotha Prabhaker Reddy ) సమక్షంలో నర్సింహులుతో పాటు ఆయన మద్దతుదారులు అందరూ బీఆర్ఎస్ పార్టీ( BRS Party )లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఎంపీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం దుబ్బాక మండల పరిధిలోని పోతారం గ్రామంలో గురువారం జరిగింది.
దుబ్బాక అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని నర్సింహులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బీజేపీ( BJP ), కాంగ్రెస్( Congress ) కేడర్ ఆకర్షితులై, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
బీజేపీ శక్తి కేంద్ర ఇంచార్జి పొసరిగళ్ల రాజు, బీజేపీ బూత్ ప్రెసిడెంట్లు పుల్లూరు ప్రవీణ్, జంగంపల్లి రాజిరెడ్డి, 8వ వార్డుకు చెందిన సీనియర్ నేత గడ్డం జ్యోతిరాజ్తో పాటు 70 మంది కార్యకర్తలు మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) సమక్షంలో బీఆర్ఎస్లో నిన్న చేరిన సంగతి తెలిసిందే.