హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు బీసీ యోధ పురస్కారానికి ఎంపికయ్యారు. రాజరత్న విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఆర్బీ అంకం ఈ విషయం వెల్లడించారు.
30 ఏండ్లుగా బీసీ హకుల కోసం ఉద్యమించిన నేతగా, బీసీ కమిషన్ సభ్యుడిగా మూడు పర్యాయాలు, ప్రస్తుతం చైర్మన్గా సేవలందిస్తున్న కృష్ణమోహన్రావు చేస్తున్న కృషి అమూల్యమైనదని కొనియాడారు. ఏపీలోని రామచంద్రపురంలోని రాజరత్న విద్యాసంస్థల ప్రాంగణంలో అక్టోబర్ రెండున అవార్డు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు.