హైదరాబాద్, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు రాజకీయ రంగంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ పెంపు తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16 వరకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ తన పాలనలో బీసీ సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు.