కామారెడ్డి, నవంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కామారెడ్డిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆలిండియా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత సీఎం రేవంత్రెడ్డిపై ఉన్నదని సూచించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న కామారెడ్డిలో బీసీ మహాసభను నిర్వహించనున్నట్టు తెలిపారు.