బాసర: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగానే ఆలయాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారికి నిత్య పూజలు మాత్రమే జరుగుతాయని భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నామని తెలిపారు.