లేకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాలి
నోటీసులు పంపిన కేటీఆర్ తరఫు లాయర్
హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపించారు. ఈ నెల 11న ట్విట్టర్లో తనపై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ పేరొన్నారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు తాను కారణమయ్యాననే ఆరోపణలపై ఆధారాలు ఉంటే ప్రజల ముందుపెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్చేశారు. లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఈ మేరకు బండి సంజయ్కి కేటీఆర్ తరఫు న్యాయవాది శుక్రవారం నోటీసులు జారీచేశారు. ‘మంత్రి కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య వ్యాఖ్యలు చేసినందుకు సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్కు పరిహారం చెల్లించడంతో పాటు, చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతున్నారు’ అని న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్కు 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో స్పష్టంచేశారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే అబద్ధాలు వల్లెవేస్తున్నారని న్యాయవాది ఆక్షేపించారు. జాతీయపార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. ప్రజాజీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్కు ఆపాదించే దురుద్దేశపూర్వక ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బండి సంజయ్ లోక్సభ సభ్యుడిగా ఉన్నతంగా వ్యవహరించాల్సి బాధ్యత ఉన్నదని గుర్తుచేశారు.