కందకూరు, ఏప్రిల్ 19 : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర హాస్యాస్పదంగా ఉందనివిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కందకూరు మండలంని మీర్ఖాన్పేట్ గ్రామంలో ఈ నెల 27న నిర్వహించే ఫ్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. మండల టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన పార్టీ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని తెలిపారు. సంజయ్ చేస్తున్న యాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ను ప్రజలు ఆదరించాలని కోరారు. ప్రధాన చౌరస్లాలో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. కేవలం 3వేల మందికే ఆహ్వానం ఉందని, మిగిలిన వారు గ్రామ గ్రామాన పార్టీ పండగలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.