హైదరాబాద్, మార్చి 28, (నమస్తే తెలంగాణ): హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (హెచ్సీఏఏ)కు గురువారం జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా అయ్యాడపు రవీందర్రెడ్డి విజయం సాధించారు. అధ్యక్ష పదవి కోసం రవీందర్రెడ్డితోపాటు మణికొండ విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఏ జగన్ పోటీపడ్డారు. రవీందర్రెడ్డి 968 ఓట్లను సాధించి తన సమీప ప్రత్యర్థి జగన్పై 33 ఓట్ల ఆధిక్యత తెచ్చుకున్నారు. రీకౌంటింగ్ నిర్వహించాక రవీందర్రెడ్డి ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. ఉపాధ్యక్షురాలిగా ఏ దీప్తి (805), జనరల్ సెక్రటరీలుగా 1280 చొప్పున ఓట్లతో ఉప్పల శాంతిభూషణ్రావు(1), జిల్లెల సంజీవ్రెడ్డి(2), జాయింట్ సెక్రటరీగా వాసిరెడ్డి నవీన్కుమార్ (902), కోశాధికారింగా కట్టా శ్రావ్య (1484), స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఎస్ అభిలాష్ (940) విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ (15 ఏండ్లు) శ్రీధర్ కోటగిరి, కార్యనిర్వాహక సభ్యులుగా డీవీ శ్రీకాంత్, సుందరేశన్ , గణపతి కొల్లి, మొహమ్మద్ హబీబుద్దీన్ గెలుపొందారు. రాష్ర్టవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లకు గురువారమే ఎన్నికలు జరిగాయి. ఒక న్యాయవాది తాను ఎంచుకున్న బార్ అసోసియేషన్లో మాత్రమే ఓటు వేసేలా నిబంధన విధించారు.