Auto Strike | రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నట్లు రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సమ్మె విరమణ పత్రాన్ని విడుదల చేశారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య ఆదివారం సాయంత్రం చర్చలు జరిగాయని.. అందులో 14 అంశాలపై చర్చించామని సమ్మె విరమణ పత్రంలో పేర్కొన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Auto Drivers Strike