హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఓలా ఊబర్, ర్యాపిడో సంస్థలు నిర్వహిస్తున్న బైక్ట్యాక్సీతో ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థలు బైక్ట్యాక్సీలు నిర్వహిస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మోటర్ బైక్ యజమానులు తమ వాహనాలను ట్యాక్సీలుగా నడపడాన్ని అనేక రాష్ర్టాలు అనుమతించడం లేదని చెప్పారు. తెలంగాణలో బైక్ ట్యాక్సీల కారణంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, బైక్ట్యాక్సీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.