హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకొంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపా రు. మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో శుక్రవారం సినీ దర్శకనిర్మాతలతో సమావేశమయ్యారు. చిత్ర నిర్మాణ వ్యయం, థియేటర్ల నిర్వహణ ఖర్చు గతంకంటే పెరిగిందని, రెండేండ్లుగా పూర్తిగా నష్టాల్లో ఉన్నామని, టికెట్ల ధరలు పెంచి సినీరంగాన్ని ఆదుకోవాలని వారు మంత్రికి విజ్ఞ ప్తి చేశారు. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్న టికెట్ ధరలపై అధ్యయనం చేసి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా నిర్ణ యం తీసుకొంటామని చెప్పారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింద ని, ప్రజలు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. థి యేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నిర్మాతలు దిల్రాజు, సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు), సునీల్ నారంగ్, డీవీవీ దానయ్య, నవీన్, వంశీ, బాలగోవిందరాజు, డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్రెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిశోర్బాబు పాల్గొన్నారు.