నిజామాబాద్ క్రైం, జనవరి 9: నిజామాబాద్ జల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా తనిఖీ చేస్తున్న పోలీసులపై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం త్రీటౌన్ ఎస్సై ప్రవళిక, ఏఎస్సై లీలాకృష్ణ, కానిస్టేబుళ్లు నర్సింహులు, రాజు శివాజీచౌక్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బైక్పై వస్తున్న ముగ్గురిని ఆపారు. సుధీర్ అనే యువకుడిని బ్రీత్ అనలైజర్లో ఊదాలని ఏఎస్సై సూచించగా, వెనుక కూర్చున్న శంకర్, గోపి బైక్ దిగి తమనే చెకింగ్ చేస్తావా? అంటూ ఏఎస్సైను కింద పడేసి చాతీపై కూర్చున్నారు. కానిస్టేబుల్పై కూడా దాడి చేశారు. ఏఎస్సై ఫిర్యాదు మేరకు యువకులపై కేసు నమోదు చేశారు.