MLC Kavitha | నిజామాబాద్లోని కిషన్ గంజ్లో నిర్మించిన నూతన ఆర్య వైశ్య సంఘం – బిగాల కృష్ణ మూర్తి భవనాన్ని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కొండ వీర శేఖర్ గుప్తా, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ భవనం నిర్మాణానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మహేశ్ బిగాల తమ తండ్రి కీ.శే. బిగాల కృష్ణ మూర్తి జ్ఞాపకార్థం రూ. 75 లక్షల విరాళం ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని వివిధ ఆర్యవైశ్య సంఘాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున రూ.60 లక్షలు మంజూరు చేశారు. ఆర్య వైశ్య వసతి గృహం నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేశారు.
ఈ కార్యక్రమంలో బిగాల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ `మా నాన్నగారి సహకారం, ప్రోత్సాహంతో మేం ఈ స్థాయికి వచ్చాం. మేం ఏ పని చేయాలన్న వారి నిర్ధేశం ప్రకారం ముందుకు వెళ్లే వారం. మా నాన్నతో మంచి అనుబంధం కలిగి ఉన్నాం. వారిని ఎల్లపుడు స్మరిస్తూ ఉన్నాం. మా నాన్నకు ఇష్టమైన అన్నదానం, బడి గుడి. మా నాన్న జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ దండు నీతు కిరణ్, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా, ఆర్య వైశ్య మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు ఆమరవాది లక్ష్మి నారాయణ గుప్తా, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల, కొత్త కొట ఎంపీపీ శ్రీమతి మౌనిక, రేణికుంట్ల గణేష్ గుప్తా, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఆగిరి వెంకటేష్ గుప్తా, ఆర్య వైశ్య మహా సభ జిల్లా అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్తా, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కొండ వీర శేఖర్ గుప్తా మరియు పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.