ఖమ్మం, జనవరి 8: సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందని ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 7వ జిల్లా క్యాబినెట్ -2023’, జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్యులకు గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని గుర్తింపు సీఎం కేసీఆర్ ఇచ్చారని కొనియాడారు. రాజకీయంగానూ ఆర్యవైశ్యులకు పదవులు ఇచ్చారని గుర్తుచేశారు.