హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నది. ఈ సర్వీసులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా మరో 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతామని, ఈ సర్వీసులకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని వెల్లడించింది.
ఎంజీబీఎస్లో రద్దీ తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12 వరకు కొన్ని మార్పులు చేశామని పేర్కొన్నది. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, మాచర్ల, ఒంగోలు వైపు వెళ్లే రెగ్యులర్, స్పెషల్ బస్సులను పాత సీబీఎస్ గౌలిగూడ నుంచి నడిపించనున్నట్టు అధికారులు తెలిపారు.