హైదరాబాద్ : లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ కోర్సు కాల వ్యవధి ఐదు నెలలు మాత్రమే. ఈ ఏడాది సెప్టెంబర్లో కోర్సు ప్రారంభమై.. వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. కాచిగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, జడ్చర్లలోని జ్ఞానసాయి లైబ్రరీ సైన్స్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్నగర్లోని నవీన్ వివేకానంద కాలేజ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్తో పాటు మరో మూడు కాలేజీల్లో 40 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లను భర్తీ చేయనున్నారు.
ఇంటర్మీడియట్, లేక తత్సమాన కోర్సు పాసైనవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 23వ తేదీ లోపు దరఖాస్తులను సంబంధిత కాలేజీల యాజమాన్యాలకు పంపాల్సి ఉంటుంది. పోస్టల్ ద్వారా లేదా నేరుగా దరఖాస్తులను సమర్పించొచ్చు. అర్హత పరీక్షలు సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకేషనల్ కోర్సులు చేసిన వారు ఈ కోర్సుకు అనర్హులు. అదనపు అర్హతలు గలవారికి డిగ్రీకి ఐదు, పీజీ చేసినవారికి పది మార్కులు కలుపుతారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. మహిళలకు 33శాతం, ప్రభుత్వ గ్రంథాలయాలు, గ్రంథాలయ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పది శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.