కాచిగూడ, ఆగస్టు 6: రాష్ట్రంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫైర్, సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకోసం ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు. ఇంటర్ ఆపై చదివిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు అని పేర్కొన్నారు. శిక్షణ పూర్తయ్యాక పరిశ్రమలు, ఎయిర్పోర్టు, ఆయిల్ కంపెనీలు, గ్యాస్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వేస్ సంస్థలలో అవకాశాలు లభిస్తాయని వివరించారు. వివరాలకు www.ncttindia.com, 9701496748లో సంప్రదించవచ్చని తెలిపారు.