హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): మేధో సంపత్తి హక్కుల్లో భాగంగా ట్రేడ్మార్క్, పేటెంట్ల నమోదు కోసం దరఖాస్తులు గణనీయంగా పెరిగాయి. మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్)-2016 అమల్లోకి వచ్చిన తరువాత ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఫైలింగ్స్ 10 వేల నుంచి 60 వేలకు పెరిగాయని ప్రొఫెసర్ పురుషోత్తం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రేడ్మార్క్ ఫైలింగ్లో ఇది అసాధారణ పెరుగుదల అని, ఇందుకు ఐపీఆర్ కార్యాలయం ప్రధానపాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ప్రతి వ్యాపారానికి, స్టార్టప్లకు ఒక విలువైన బ్రాండ్ను రూపొందించడంలో ట్రేడ్మార్క్ ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. తమ విలువైన సేవలను అందించేందుకు పోటీ పడుతున్న విద్యాసంస్థలు కూడా తమ బ్రాండ్ వాల్యూను పెంచుకోవడానికి ట్రేడ్మార్క్ల కోసం ఫైల్ చేయాలని సూచించారు. పేటెంట్లను ఉత్పత్తులుగా మార్చడంతోపాటు వాటికి మార్కెట్ డిమాండ్ సృష్టించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఐపీఆర్ లీగల్ హెడ్ శుభజిత్ సాహా అన్నారు. విద్యాసంస్థల ట్రేడ్మార్క్ ఫైలింగ్ ఫీజులను తగ్గించడం శుభపరిణామమని పేర్కొన్నారు.