హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్విట్టర్ వేదికగా శనివారం ఓ సూచన చేశారు. రాష్ర్టానికి జాతీయస్థాయి ప్రాజెక్ట్లు తీసుకురావాలని సూచించారు.
‘తెలంగాణకు ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, స్టీల్ ప్లాంట్, ట్రైబల్ వర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, డిఫెన్స్ కారిడార్, పసుపుబోర్డు ఇవ్వాలని మోదీ, అమిత్షాలను కోరాలని గవర్నర్కు విజ్ఞప్తి. రాజకీయ, వ్యక్తిగత కుమ్ములాటలు తెలంగాణ ప్రజలకు ఏమీ అందించలేవు’ అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.