హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, అల్లం నారాయణ వివరంగా కొమ్మినేనికి వివరించారు. గత ఎనిమిది సంవత్సరాల నుంచి అకాడమీ నిర్వహించిన శిక్షణ తరగతులు, సెమినార్లు ఇతర కార్యక్రమాలు తెలిపారు. అలాగే మీడియా అకాడమీ ప్రచురణలు, ఇతర వివరాల నోట్ అందజేశారు. ఇద్దరు చైర్మన్లు ఒకరినొకరు శాలువాతో సత్కరించారు. తెలంగాణ అకాడమీ సెక్రెటరీ నాగులాపల్లి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.