హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్థానిక సంస్థలకు జరిగిన 12 స్థానాలకు 6 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, నేడు ఎన్నిక జరిగిన మరో ఆరుగురు అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు అభ్యర్థులు భానుప్రసాదరావు, ఎల్. రమణ, దండే విఠల్, యాదవరెడ్డి, ఎం.సి.కోటిరెడ్డి, తాతా మధులకు శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారి కూడా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్కు మద్దతు పలికిన స్థానిక సంస్థల సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.