హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్బండ్పై ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం చాకలి ఐలమ్మ ఉద్యమస్ఫూర్తిని 5వ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చిందని, అధికారికంగా జ యంతి ఉత్సవాలను నిర్వహించిందని తెలిపారు. విగ్రహం ఏర్పాటుకు సీఎం చొరవ చూపాలని ఆయన కోరారు.