ధూళిమిట్ట, జూన్ 10: ఏడాదికి రూ.28 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి ఓ గిరిజన బిడ్డ ఔరా అనిపించాడు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం రెడ్యానాయక్ తండాకు చెందిన ధరావత్ వాలి, మోతీరామ్ దంపతుల కుమారుడు ధరావత్ సురేందర్ పదోతరగతి వరకు మద్దూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. డీఆర్డీఏ సహకారంతో హన్మకొండలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. జేఈఈ అర్హతతో కేరళ కాలికట్లోని నిట్లో బీటెక్ చదివాడు. ప్రస్తుతం రూ.28 లక్షల వార్షిక ప్యాకేజీతో సర్వీస్ నౌ అనే సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం సాధించాడు.