హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): బైండ్ల కుల సంఘం భవన నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ముంగనూర్లో 20 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే బైండ్ల కమ్యూనిటీ భవనం కోసం 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. అది పూర్తిగా రాళ్లతో నిండి ఉండడంతో భవన నిర్మాణానికి అనుకూలంగా లేదని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ముంగనూర్లో 20 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.