న్యూఢిల్లీ, జూన్ 17: అగ్నిపథ్పై కేంద్రం ఒంటెత్తు పోకడ మానుకోవడం లేదు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నది. నిరసనలు జరుగుతున్న వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అగ్నికి ఆజ్యం పోసే ప్రయత్నం చేశారు. అగ్నివీరుల నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. ఈ నెల 24 నుంచి ఎయిర్ఫోర్స్లో నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. రెండ్రో జుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే ప్రకటించారు.
తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ అగ్నిపథ్పై కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అగ్నిపథ్ సైన్యానికి, యువతకు మంచి చేస్తుందని సమర్థించుకుంటున్నారు. ఆందోళనలను ప్రతిపక్ష పార్టీలపైకి నెట్టే ప్రయత్నం చేశారు. అగ్నిపథ్లో వయసు పరిమితి పెంపుతో అనేక మందికి లబ్ధి అని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పుకొచ్చారు. యువతను పలు రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రులు తోమర్, వీకే సింగ్ ఆరోపించారు. అగ్నిపథ్ ఒక మంచి మార్పు అని గడ్కరీ అన్నారు. బీహార్లో ఆందోళనలకు ఆర్జేడీనే కారణమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.