హైదరాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): రైతులకు మినీ సాయిల్ టెస్టింగ్ కిట్స్ను వెంటనే అందించాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
మట్టి పరీక్షల నిర్వహణపై హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 భూసార పరీక్షా కేంద్రాలను రైతులకు మరింత అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.