రామాయంపేట/మనోహరాబాద్, ఫిబ్రవరి 18 : కేంద్ర సర్కారు రైతులను దగా చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో నూతనంగా నెలకొల్పిన అక్షయ అగ్రి పరిశ్రమను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి శనివారం సందర్శించారు.
పరిశ్రమంలో తయారుచేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం తెలంగాణను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. రైతుబంధుతో తెలంగాణ సర్కారు రైతులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ మాదిరిగా దేశ రైతులకు సకల సౌకర్యా లు కల్పిస్తే దేశాభివృద్ధి చెందుతుందని అన్నా రు. వరి కోతల అనంతరం వడ్లను ఆరబెట్టే యంత్రాలు తయారుచేస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతాయని మంత్రి అగ్రి పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు.