వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 15: ఇటీవల విడుదల చేసిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఐఐఆర్ఎఫ్)- 2026 ర్యాంకుల్లో హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోని అగ్రివర్సిటీల్లో 19వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది 24వ ర్యాంకు పొందగా, ఈసారి ఐదు స్థానా లు మెరుగు పర్చుకున్నది. వర్సిటీ శాస్త్రవేత్తలు, సిబ్బంది వీసీ అల్దాస్ జానయ్యను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ.. 2027 నాటికి తొలి 10 ర్యాం కుల్లో నిలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. వర్సిటీలో ప్రస్తుతం 130 మంది ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో చాలా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.