Adibhatla Police : దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలో ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి కాండోలిమ్ బీచ్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని గోవా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసును ఒక్క రోజులోనే ఛేదించారు. ఈ నెల 9న నవీన్ రెడ్డి, అతని స్నేహితులు వైశాలి ఇంటిపై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేశారు. వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్పటికే 21 మందిని అరెస్ట్ చేశారు. 9వ తేదీ నుంచి నవీన్ పరారీలో ఉన్నాడు.