బంజారాహిల్స్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క సారలమ్మ జాతర దేశంలోనే అత్యధికులు పాల్గొనే జాతరల్లో ఒకటిగా మారిందని సినీ నటుడు సుమన్ అన్నారు. ‘సమ్మక్క- సారక్క జాతర చూడపోదాం రండి’ పేరుతో రూపొందించిన జానపద వీడియో సాంగ్ను హీరో సుమన్ గురువారం ఫిలింనగర్లోని ఫిలించాంబర్లో ఆవిష్కరించారు. దర్శకుడు, కొరియోగ్రాఫర్ కట్ల రాజేంద్రప్రసాద్ రూపొందించిన ఈ వీడియో సాంగ్ అద్భుతంగా, సమ్మక్క సారక్క జాతర విశిష్టతను మరింతగా చాటిచెప్పేలా ఉందని సుమన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత రాంసత్యనారాయణ, నటి శ్రీదేవి, వీడియో నిర్మాతలు నరేశ్కుమార్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.