దామరగిద్ద, ఏప్రిల్ 7: రైతు సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్తోనే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని సినీ నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్సింగ్ విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. భగత్సింగ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు.