Marriguda | నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల తహసీలద్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డికి చెందిన హైదరాబాద్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు బయటపడ్డాయి.
ఒక్క ట్రంక్ పెట్టెలో రూ. 2 కోట్లకు పైగా నగదు లభ్యమైనట్లు పేర్కొన్నారు. భారీగా బంగారం లభ్యమైంది. మహేందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులో సోదాలు నిర్వహించారు. మహేందర్ రెడ్డికి సంబందించిన 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మంచిరెడ్డి మహేందర్ రెడ్డి కందుకూరు నుండి ఇటీవలే మర్రిగూడ మండలానికి బదిలీపై వచ్చారు.