శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో షష్టి సందర్భంగా ఈవో లవన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సాక్షి గణపతి స్వామివారికి, కుమారస్వామికి అభిషేకాలు పుష్పార్చనలు చేశారు. అదేవిధంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతలైన జ్వాలావీరభద్రస్వామివారికి షోడశోపచార క్రతువులు శాస్ర్తోక్తంగా జరిపించారు. మల్లికాగుండంలోని శుద్ధ జలాలతో స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు పూజాధి క్రతువులు చేసినట్లు అర్చకులు తెలిపారు.
శ్రీశైలం దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సికింద్రాబాద్కు చెందిన అజయ్ కుమార్ లక్ష రూపాయల విరాళాన్ని వి.ఎస్ ప్రకాశ్ రావు ఙ్ఞాపకార్థం ఇచ్చారు. బుధవారం ఆలయ ఏఈవో మల్లయ్యకు విరాళాన్ని చెక్కు రూపంలో అందించగా దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.