పాలమూరు, అక్టోబర్ 15 : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కలాం స్ఫూర్తిగా అందరూ అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు, నూతన ఆవిష్కరణల కోసం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్ మహబూబ్నగర్లోని సద్దలగుండులో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్, అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం శ్రీధర్ పడుతున్న తపన ఉపాధ్యాయ లోకానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సేవలను మరింత మందికి అందించేందుకు ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రభుత్వ స్థలం, నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు.