హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ లేదని చెప్పి పాస్బుక్ల జారీ అధికారులు నిలిపివేయడం సరికాదని పేర్కొన్నది.
వికారాబాద్ జిల్లా కొట్రేపల్లికి చెందిన అమినా బేగం తన 6.02 ఎకరాలకు పాస్ పుస్తకం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకొంటే ఆధార్ లేదని చెప్పి పాస్ పుస్తకం జారీకి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. దీంతో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద బుధవారం విచారణ చేపట్టారు. తమ ఉత్తర్వుల ప్రతి అందిన రెండు వారాల్లోపు పిటిషనర్కు ఆధార్ లేకుండానే పట్టాదార్ పాస్ పుస్తకాన్ని అందజేయాలని ఆదేశించారు.