బొమ్మలరామారం, మే 18: వడ్లు తూర్పారపడుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఫ్యాన్లో పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన మాధవి గురువారం మల్యాల గ్రామంలో ట్రాక్టర్ తూర్పార యంత్రంతో వడ్లు తుర్పార పడుతుండగా ప్రమాదవశాత్తు చీర చిక్కుకొని తల పలిగి అక్కడికక్కడే మృతిచెందింది.