Tomato | కౌడిపల్లి, జూలై 29 : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన రైతు బాన్సువాడ మహిపాల్రెడ్డి టమాటా పండించి వచ్చిన ఆదాయంతో టయోటా ఫార్చూనర్ కారు కొన్నాడు. ఈ కారు తాళం చెవిని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి శనివారం మహిపాల్రెడ్డికి అందజేశారు.
శామీర్పేటలో కూరగాయల సాగు సంఘం ఆధ్వర్యంలో టమాటా రైతు మహిపాల్రెడ్డిని ఘనంగా సత్కరించారు. మహిపాల్రెడ్డి 8 ఎకరాల్లో టమాటా పంట పండించి, సుమారుగా రూ.3 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించాడు. రూ.50 లక్షల టయోటా ఫార్చూనర్ కారు కొని రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాడు.