సిద్దిపేట : జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్తో పాటు చిన్నకోడూరు మండల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్ను మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు బృందం ఆదివారం సందర్శించింది. 15 మందితో కూడిన ఈ బృందం రిజర్వాయర్, పంపుహౌస్లను పరిశీలించింది.
బృందంలో మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ సీఈలు ఏఎన్ బహదూర్, ఏఎల్ పతాక్, పీజీ మందదె, ఎస్ఎం బెల్సరె, ఎస్ఈలు ఏటీ దేవ్గాడె, ఆర్ఎస్ దేశ్ముఖ్, ఎస్వీ చౌదరి, ఈఈలు ఎస్పీ అడె, ఎస్వీ హొజారె, ఏఏ సవంత్, ఎస్ఎస్ మున్నోలి, వీవీ బాగుల్, ఎస్జీ రాతి, ప్రణతి గోట్మారె, అరుణ్ నాయక్ వాడె అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాగు నీరందించాలనే గొప్ప ఆశయంతో భారీ వ్యయంతో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మించిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరిగేషన్ అధికారుల శ్రమ ఎంతగానో ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లను చాలా త్వరితగతిన పూర్తి చేసిందన కితాబు ఇచ్చారు.