మహబూబ్నగర్ జిల్లాలోని ఎన్హెచ్-44పై మూసాపేట మండలంలోని వేముల స్టేజీ వద్ద శ్రీనివాసులు, బాలరాజు సోదరులు మారుతి దాబాను నిర్వహిస్తున్నారు. అయితే.. గురువారం ఉదయం దాబాలో శబ్ధం రావడంతో.. అనుమానం వచ్చి ఫ్రిజ్ కింద వెతకగా కొండచిలువ కనిపించింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న మహబూబ్నగర్ జిల్లా వేముల గ్రామానికి చెందిన గణేశ్నాయుడు దాబా వద్దకు చేరుకుని కొండచిలువను పట్టుకున్నాడు. గాజులపేట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలినట్టు గణేశ్ తెలిపాడు. పాము 16 ఫీట్ల పొడవు ఉన్నట్టు చెప్పాడు.
-మూసాపేట