హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): మూడు నెలల పసిపాప ప్రాణాన్ని ఓ కోతి చిదిమేసింది. ఈ విషాద ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం మురుగమ్మికి చెందిన బేల్దారీ మేస్త్రిగా పనిచేస్తున్న రవీంద్ర, సుమతి దంపతుల చిన్న కూతురి (3 నెలలు)ని తల్లి ఇంటి ఆవరణలో పడుకోపెట్టి ఇంటి పనిలో నిమగ్నమైంది. ఇంతలో ఓ కోతి అక్కడికి వచ్చి పాపను ఎత్తుకెళ్లింది. కొద్దిదూరం ఈడ్చుకెళ్లి ఇనుప వస్తువులపై పడేసింది. దీంతో చిన్నారి తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న పాపను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు.