హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ కోరారు. మంగళవారం హైదరాబాద్లోని నాంపల్లిలో టీఎన్జీవోల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సుమారు 40 ఏండ్లపాటు టీఎన్జీవోకు సారథ్యం వహించిన బీ స్వామినాథం మృతికి సంతాపం ప్రకటించారు. టీఎన్జీవో మాజీ అధ్యక్షులు స్వామిగౌడ్, డీ సుధాకర్ హాజరై నివాళి అర్పించారు. మీటింగ్ హాల్కు స్వామినాథం మెమోరియల్ హాల్గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా రాజేందర్, ప్రతాప్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. సమావేశంలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోలా రాజేశంగౌడ్, ఎం సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావుతోపాటు ముఖ్య నేతలు ముజీబ్, ఆకుల రాజేందర్, సోమన్న, కిషన్, జగదీశ్వర్, రామ్ కిషన్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవే..