వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పూర్తి చేసిన అనాథ విద్యార్థులకు పై చదువులకోసం సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు జిల్లా మహిళా దివ్యాంగుల శాఖ అధికారిణి కేతవత్ లలిత కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన ప్రకారం.. అన్ని జిల్లాలో ఉన్న అనాథలు, వదిలివేయబడిన పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, ఏ విధముగా అయినా ఇతర పిల్లలు పై చదువులకు దూరం కాకూడదు అనే ఉద్ధేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గబాయ్ దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కళాశాలలో పై చదువులు నిర్వహించబడుతాయని అన్నారు.
కావున పైన తెలిపిన కేటగిరిలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ విషయానికి సంబంధించిన వివరాల కోసం సంబంధిత ఐసిడిఎస్, సిడిపీఎస్ కార్యాలయల్లో సంప్రదించాలని తెలిపారు. ఇట్టి దరఖాస్తులు ఈ నెల 24లోపు అందజేయకగలరని, ఇతర సందేహల కోసం వికారాబాద్ ఎన్నేపల్లి ఉన్న బాలరక్ష భవన్ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.